స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హతమార్చేందుకు బీజేపీ అభ్యర్థి రాథోడ్ కుట్ర చేశారనే సంచలన ఆరోపణలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. కాంగ్రెస్ ఇంచార్జ్ రణ్ దీప్ సూర్జేవాలా ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాఫ్తునకు ఆదేశిస్తామన్నారు. విచారణ అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బొమ్మై వెల్లడించారు. కాగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతో ఖర్గే కుటుంబాన్ని అంతం చేయడానికి బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కుట్రలు చేస్తున్నారని సూర్జేవాలా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇప్పటికే రాథోడ్ కొట్టి పారేశారు.
Also Read: మల్లికార్జున ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర: సూర్జేవాలా