ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయన్నారు మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడిందని.. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ళ కుల్లును, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుందన్నారు. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.