24.9 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

కంగ్రాట్స్ ఆదిత్య

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఆదిత్య ఎల్‌-1 వ్యోమ నౌకను లగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. భూమి నుంచి సూర్యుని దిశగా సుమారు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు.

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లింది ఆదిత్య ఎల్‌-1. ఇప్పుడు ఈ కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇది నిరంతరాయంగా సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. అదే సమయంలో సౌరవాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఈ ప్రయోగం లక్ష్యం. దేశం తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే.

ఇక, ఆదిత్య ఎల్‌-1 కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రోపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు… శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్