స్వతంత్ర వెబ్ డెస్క్: బ్యాడ్మింటన్లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ను భారత్కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఆదివారం జకార్తాలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో మలేషియా జోడీ అయినా ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జోడిని ఓడించి విజేతగా నిలిచింది. హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేతగా నిలిచిన మొదటి భారత జోడిగా రికార్డు నెలకొల్పింది. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ జోడి ప్రదర్శన ఈ ఏడాది నిలకడగా ఉంది. ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్ షిప్లో విజేతలుగా నిలిచి స్వర్ణ పతకాలను అందుకోగా మలేసియా ఓపెన్లో సెమీస్లో ఓడింది. అయితే.. తాజాగా ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటి విజేతగా నిలిచింది.