23.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదాలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: మన దేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పడి 170 సంవత్సరాలు దాటింది. ఇన్ని దశాబ్దాల చరిత్రలో భారత రైల్వే కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు కీలక రవాణా మార్గంగా మారింది. ఈ క్రమంలో మానవ తప్పిదాలు, సిగ్నల్ వ్యవస్థ లోపం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నో రైల్వే ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ ఏడు దశాబ్దాల్లో చోటుచేసుకున్న అత్యంత విషాద రైలు ప్రమాద ఘటనలను ఓసారి తెలుసుకుందాం.

** ధనుష్కోటి ప్రమాదం: 1964 డిసెంబర్ 23న తమిళనాడులోని ధనుష్కోటిలో భారీ తుఫాన్ కారణంగా పంబన్- ధనుష్కోటి పాసింజర్ రైలు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 126 మంది ప్రాణాలు కోల్పోయారు.

** భాగమతి ప్రమాదం: 1981 జూన్ 6న భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రమాదం చోటు చేసుకుంది. బీహార్‌లోని భాగమతి నదిపై ఉన్న వంతెనను దాటుతూ రైలు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 750 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు.

** ఫిరోజాబాద్ ప్రమాదం: 1995 ఆగస్టు 20న ఫిరోజాబాద్ సమీపంలో ఆగి ఉన్న కలింది ఎక్స్‌ప్రెస్‌ రైలును వేగంగా వచ్చిన పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 358 మంది ప్రయాణికులు చనిపోయారు.

** ఖన్నా  ప్రమాదం: 1998 నవంబర్ 26న పంజాబ్‌లోని ఖన్నా ప్రాంతంలో కలింది ఎక్స్‌ప్రెస్‌ను జమ్ముతావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో 212 మంది మృతి చెందారు.

** గౌసల్ ప్రమాదం: 1999 ఆగస్టు 2న కతిహార్ డివిజన్‌లోని గైసల్ స్టేషన్‌లో ఆగి ఉన్న అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌ రైలును బ్రహ్మపుత్ర రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 290 మంది మరణించారు.

** రఫీగంజ్ ప్రమాదం: 2002 సెప్టెంబరు 9న బీహార్‌లోని రఫీగంజ్‌లో ధావే నదిపై ఉన్న వంతెనపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 140 మందికి పైగా మరణించారు

** గోల్కొండ రైలు ప్రమాదం: 2003 జూలై 2న గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద పట్టాలు తప్పి ఇంజిన్, రెండు బోగీలు కిందపడ్డాయి. నాటి ప్రమాదంలో 22 మంది మృతి చెందారు.

** ఝర్‌గ్రామ్ ప్రమాదం: 2010 మే 27న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అంతలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో 148 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

** కాన్పూర్ ప్రమాదం: 2016లో యూపీలోని కాన్పూర్ సమీపంలో ఇండోర్- రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి 260 మంది చనిపోయారు.

** ఒడిశా ప్రమాదం: 2023 జూన్ 2న బాలాసోర్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్‌ను ఢీకొట్టడంతో 290మందికి పైగా ప్రాణాలు వదిలారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్