Yadadri | తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కీర్తిగడించిన యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగింది. యాదగిరీశున్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. తాజాగా, ఆలయ ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. అన్ని ఆదాయ మార్గాల ద్వారా దేవస్థానానికి రూ. 69,69,250 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
[ప్రధాన బుకింగ్ – రూ. 6,67,600, కైంకర్యములు – రూ. 3,600, సుప్రభాతం – రూ.10,400, పుష్కరిణీ – రూ.1,600, వ్రతాలు – రూ.1,53,600, ప్రచార శాఖ – రూ. 24,190, వీఐపీ దర్శనం – రూ. 3,00,000, యాదరుషి నిలయము – రూ.1,34,334, ప్రసాద విక్రయం – రూ.18,32,700 , పాతగుట్ట – రూ. 64,990, కళ్యాణ కట్ట – రూ. 1,47,500, వాహన పూజల – రూ. 23,100, కొండపైకి వాహన ప్రవేశాలు – రూ. 5,50,000, సువర్ణ పుష్పార్చన – రూ. 1,16,232, శివాలయం – రూ.10,000, అన్నదానము – రూ.17,309, బ్రేక్ దర్శనం – రూ. 5,20,200, క్లాక్ రూమ్ మొబైల్ కౌంటర్ – రూ. 41,895, లీగల్, లీజేస్ – రూ. 23,50,000 ]