మహబూబాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మి లను చూసాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ . భార్యల సీటు కోసం భర్తలు కొట్టుకు న్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. తొర్రూరు నుంచి ఉప్పల్ చౌరాస్తా రోడ్డుకు బయల్దేరిన బస్సు లో పలువురు కర్చీఫ్ లు వేసి సీట్లు అపుకున్నారు. అయితే ఒకరు ఆపుకొన్న సీటులో మరొకరు కూర్చోవడంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకూ వెళ్లింది. కండక్టర్ ఫిర్యాదు తో పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.


