మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. సినిమా ప్రమోషన్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలో వరుణ్ తేజ్ పర్యటించారు. అనంతరం మాధవరం మాజీ సైనికోద్యోగులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగులో ఈ మూవీ ట్రైలర్ను రామ్ చరణ్ విడుదల చేయగా.. హిందీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తూ వరుణ్ తేజ్ మీద ప్రశంసలు కురిపించాడు. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన అనుభూతిని ఇచ్చేలా మూవీ ట్రైలర్ ఉంది. 2019 ఫిబ్రవరి 14న బాలాకోట్ మీద పాకిస్తాన్ చేసిన దాడుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. పాకిస్తాన్ మీద మన దేశ వైమానిక దళం చేసిన ఈ ఆపరేషన్ను ఆపరేషన్ వాలెంటైన్గా తెరపైకి తీసుకొచ్చారు.