హీరో అల్లు అర్జున్కు ఏపీ హైకోర్ట్లో ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. నవంబర్ ఆరున నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. దీంతో.. అల్లు అర్జున్తోపాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటీషన్ వేశారు.