స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వచ్చే రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కుండపోత వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. పలు చోట్ల మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన మోచా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశముందని వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. అనంతరం గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని.. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది.