Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కారు దృష్టి

   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కారు దృష్టిసారించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన 317, 46 జీవోలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా ఏర్పాటైన ఉప సంఘంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను సభ్యులుగా నియమించింది. ఈ జీవోల పర్యవసానాలను పరిశీలించి ప్రభుత్వానికి ఉపసంఘం నివేదిక సమర్పించనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల సమస్య కొంతలో కొంతైనా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.

    2021 డిసెంబరు 6న 317 జీవో, 2022 ఏప్రిల్‌ 4న 46జీవోను జారీ చేశారు. వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌గా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. కమిటీ నిర్వహించే సమావేశాలకు సంబంధిత శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతో రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల ఆధారంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టేందుకు 317 జీవోను జారీ చేశారు. అయితే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది. సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులను వివిధ జిల్లాలకు కేటాయించారు. దాదాపు 30వేల మందిని బదిలీ చేశారు. ఈ సర్దుబాటు సక్రమంగా జరగలేదని, జూనియర్లను దూర ప్రాంతాలకు బదిలీ చేశారంటూ అప్పట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. స్థానికత ఆధారంగా సొంత జిల్లాలను కేటాయించాలని డిమాండ్‌ చేశాయి.

బదిలీల సందర్భంగా కనీసం స్పౌజ్‌ కేసులను కూడా పట్టించుకోలేదని, బదిలీ అయినవారిలో సగం మందికి అన్యాయం జరిగిందంటూ సంఘాలు ఆరోపించాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి భార్యాభర్తల కేసులను పరిష్కరించింది. అయితే 13జిల్లాల స్పౌజ్‌ కేసులను పరిష్కరించలేదు. ఇప్పటికీ భార్య ఒక చోట, భర్త మరో చోట పని చేయాల్సి వస్తోందని సంఘాలు అంటున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇది తమ పదోన్నతులపై తీవ్ర ప్రభావం చూపిందని ఉద్యోగులు అంటున్నారు. అయినా గత ప్రభుత్వం 317జీవో సమస్యను పరిష్కరించలేకపోయింది. ఇప్పటికీ ఈ సమస్య రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్