31.7 C
Hyderabad
Saturday, June 14, 2025
spot_img

రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పథకం 16వేలకు పెంపు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు సీఎం కేసీఆర్. అర్హులైన వారందరికీ రూ.400 కే సిలిండర్, ఆరోగ్య శ్రీ కి రూ.16 లక్షలకు పెంపు, అసైన్డ్ భూముల యజమానులకు పట్టాలు, రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ వంటివి మేనిఫెస్టోలో ప్రకటించారు. ముఖ్యంగా రైతులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ ఎకరానికి రూ.12వేలు అందజేస్తున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు 16వేలకు పెంచారు. రైతుబంధుతో తెలంగాణలో వ్యవసాయాన్ని స్థిరీకరిస్తామని తెలిపారు. మొదటి ఏడాది రూ.12వేలు అందజేసి.. ఆ తరువాత ప్రతీ విడుతకు రూ.500 పెంచనున్నట్టు సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం గురించి ప్రకటించారు. ప్రజలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా.. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు వర్తించనుంది. ఎల్ఐసీ ద్వారా బీమా పంపిణీ.  గిరిజనులకు పోడు భూముల పట్టాలు.. రైతు బంధు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.  మైనార్టీ సంక్షేమానికి మరిన్నీ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్