జల్జీవన్ మిషన్లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందని తెలిపారు. తాగునీటి సరఫరాలో జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్జీవన్ మిషన్ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


