31.7 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

భోపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం

స్వతంత్ర వెబ్ డెస్క్: భోపాల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక ఆఫీసులున్న సాత్పూరా భవనంలో ప్రమాదం జరిగింది. ఎయిర్‌ఫోర్స్, స్థానిక అధికారులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి సుమారు 14గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. సాత్పూరా భవన్ లోని 3వ ఫ్లోర్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో చెలరేగిన మంటలు వేగంగా పైనున్న అన్ని అంతస్థులకు వ్యాపించాయి. మంటలు వ్యాపిస్తున్న క్రమంలో ఎయిర్‌ కండీషనర్లు, గ్యాస్‌ సిలిండర్లు పేలిపోవడంతో మంటల తీవ్రత బాగా పెరిగిపోయిందని అధికారులు ప్రకటించారు. సాత్పూరా భవనంలో మంటలు చెలరేగిన గిరిజన సంక్షేమ శాఖలోని ఫైళ్లతోపాటు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన పలు ఫైళ్లు ఇతర శాఖలకు చెందిన ఫైళ్లు సైతం దగ్ధమయ్యాయని అధికారులు ప్రకటించారు.

భారత వైమానిక దళానికి చెందిన విమానం AN-52, MI-15 ఛాపర్ డౌసింగ్ ఆపరేషన్‌లో చేరి పై నుండి బకెట్లను ఉపయోగించి నీటిని పోశాయి. ప్రమాద సమయంలో సకాలంలో భవనంలోని అధికారులు, సిబ్బందిని ఖాళీ చేయించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికి ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి, హోంమంత్రి అమిత్ షాలకు సమాచారం అందించారని.. మంటలను ఆర్పేందుకు కేంద్ర సహాయాన్ని కోరినట్టు రాష్ట్రానికి చెందిన ఒక అధికారి తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్