ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్లో కదర్గంజ్కు బయల్దేరారు. ఈ క్రమంలో కస్గంజ్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా… పలువురు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలిం చారు.