పర్యాటకరంగం బహుముఖాలుగా విస్తరించింది. తాజాగా హెల్త్ టూరిజం హల్చల్ చేస్తోంది. సాధార ణంగా, మరొక దేశానికి వైద్య చికిత్స కోసం వెళ్లడాన్నే మెడికల్ పరిభాషలో హెల్త్ టూరిజం అంటున్నారు. హెల్త్ టూరిజాన్నే మెడికల్ టూరిజం అని కూడా అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎన్ని సిరిసంపదలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే వృధాయే. ఆరోగ్యంపై ప్రజల ఆలోచనాధోరణి మారింది. వ్యాధులు వస్తే, వెంటనే చికిత్సల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అవసరమైతే విదేశాలకు కూడా వెళుతున్నారు. దీనినే హెల్త్ టూరిజం అంటున్నారు. ఇటీవలికాలంలో హెల్త్ టూరిజం పుంజుకుం ది. ఇందులో ట్రావెల్ ఏజన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విదేశాలలో వైద్య చికిత్సలు పొందాలనుకునే వారికి అవసరమైన ప్యాకేజీలు అందించడంలో ట్రావెల్ ఏజన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వైద్య చికిత్సకోసం విదేశాలను ఎంచుకుంటున్నారు. దీనికి అనేక కారణా లున్నాయి. స్వంత దేశంలో సదరు వ్యాధికి అవసరమైన వైద్య సేవలు లేకపోవడం. అలాగే వైద్య చికిత్సకయ్యే యావత్ ఖర్చు. సదరు పేషెంట్ ఆరోగ్య బీమా ప్రక్రియ పరిధిలోకి రాకపోవడం. అన్నిటికంటే ముఖ్యమైన కారణం స్వంత దేశాల్లో చికిత్సకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం. దీంతో తక్కువ ఖర్చులో నాణ్యమైన చికిత్స కోసం ట్రావెల్ ఏజన్సీల సాయంతో విదేశాలకు ప్రజలు వెళ్లే ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరిగింది.ఒకప్పుడు విదేశీ ప్రయాణం అంటే చిన్న విషయం కాదు. అయితే కాలక్రమంలో ప్రపంచంలో సామాజిక పరిస్థితులు మారిపోయాయి. ఆరోగ్యం కోసం విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవడం సులభమైపోయింది. అంతేకాదు ఆరోగ్య సంరక్షణలో అనేక దేశాలు ముందం జలో ఉన్నాయి.అయితే అన్ని దేశాల్లో ఈ మేరకు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అభివృద్ధి ఆశించి న స్థాయిలో జరగలేదు.దీంతో వైద్య చికిత్స కోసం ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలకు పేషెంట్లు పరుగులు తీస్తున్నారు.
హెల్త్ టూరిజంలో ఉన్న అతి ముఖ్య ప్రయోజనం తక్షణమే ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి హెల్త్ టూరిజంలో ప్రాధాన్యం ఇస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన అంశాల తో వ్యవహరించేటప్పుడు వేచి చూసే పద్దతి పనికిరాదు. సహజంగా హెల్త్ టూరిజంలో భాగంగా అందే వైద్య చికిత్సలో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇటీవలికాలంలో భారత్ హెల్త్ టూరిజానికి హబ్గా మారింది. భారత్తో పోలిస్తే అనేక దేశాల్లో వైద్యానికి బాగా డబ్బులవుతాయి. సామాన్య ప్రజలు ఈ ఖర్చును భరించలేరు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు బాగా తక్కువ. అంతేకాదు భారత్ లో శస్త్రచికిత్సా విధానాలు అత్యుత్తమ సాంకేతికత ను ఉపయోగి స్తుంటాయి. అంతేకాదు సుశిక్షితులైన వైద్య నిపుణులు ఈ చికిత్స అందిస్తారు. దీంతో, అనేక దేశాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం భారత్కు వస్తున్నారు. ఇలా వచ్చే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలోని పంచకర్మ ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం విదేశాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.
విదేశీ క్లయింట్లను ఆకట్టుకోవడానికి పేరొందిన వైద్య సంస్థలు రకరకాల ప్యాకేజీలను సిద్ధం చేశాయి. సంపన్నులకు ఒక రేటు, మధ్యతరగతికి ఒక రేటు, పేదలకు మరో రేటు అంటూ చికిత్స ఖర్చును ఫిక్స్ చేశాయి. అయితే చికిత్స విష యంలో రవ్వంత కూడా రాజీ పడటం లేదు వైద్యసంస్థలు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే రోగుల భరోసాను భారతదేశానికి చెందిన వైద్య సంస్థలు నిలబెట్టుకుంటు న్నాయి. రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాయి. మనదేశం లో మొత్తం పది నగరాలు హెల్త్ టూరిజంలో కీలకంగా ఉన్నాయి.ఈ టాప్ టెన్ సిటీల్లో హైదరాబాద్ కూడా ఉండటం విశేషం. హైదరా బాద్ నగరంలో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు కూడా మిగతా నగరాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్య చికిత్స అందిస్తాయి. హైదరాబాద్ తో పాటు చెన్నై, ముంబై, గోవా, న్యూఢిల్లీ, బెంగ ళూరు, అహ్మదా బాద్, కోయంబత్తూరు, వెల్లూరు, అల్లెప్పీ ఉన్నాయి.