డ్రోన్లు, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరింపుతో ఢిల్లీలోని ఓ కళ్యాణ మండపం శత్రు దుర్భేద్యంగా మారింది. పోలీసులు చేసిన ఈ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ఇద్దరు గ్యాంగ్స్టర్ల వివాహానికి వేదిక కానున్న ఫంక్షన్హాల్ దగ్గర పరిస్థితి ఇది. తిహాడ్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ సందీప్, బెయిల్పై ఉన్న ఓ మహిళా క్రిమి నల్కు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో గ్యాంగ్వార్ జరిగే అవకాశం ఉండటం, కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకోవడం వంటి ఘటనలకు జరగకుండా ఢిల్లీ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో ఉన్న సంతోష్గార్డెన్లో ఈ వివాహం జరగనుంది. సందీప్ తరఫు న్యాయవాది రూ.51వేలు చెల్లించి వేదికను బుక్ చేశాడు.
సందీప్ గతంలో ఓ సారి హరియాణా పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు బలగాలపై దాడి చేయించాడు. దీంతో మరోసారి అటువంటి ఘటనల జరగకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్ ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు మొదలు.. లోనికి వచ్చే వారికి బార్కోడ్ బ్యాండ్లు, వాహనాలకు ప్రవేశ పాసులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. హరియాణాకు చెందిన సందీప్, రాజస్థాన్కు చెందిన మేడమ్ మింజ్లు అనేక కేసుల్లో నిందితులు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి పదికి పైగా కేసులున్నాయి. గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్ సింగ్ వద్ద పనిచేసిన అనురాధా చౌధరిపై హిస్టరీ షీట్ ఉంది. ఆమె ప్రస్తుతం బెయిల్పై బయట ఉండగా.. తిహాడ్ జైల్లో ఉన్న సందీప్ పెళ్లి కోసం న్యాయస్థానం ఆరు గంటలు పెరోల్ ఇచ్చింది.