స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దయాకర్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా అమరచింత నుంచి రెండుసార్లు, ఒకసారి మక్తల్ నుంచి విజయం సాధించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురంలో జన్మించిన దయాకర్రెడ్డి పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. దయాకర్రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.