Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

కొంపముంచిన అర్వింద్‌ వ్యాఖ్యలు

రాజకీయ నేతలు చేసే కామెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రత్యేకించి ఎన్నికల వేళ వాళ్లు మాట్లాడే ప్రతి మాట చాలా కీలకమే. ఏదైనా తప్పుదొర్లినా, తేడా వచ్చినా ప్రత్యర్థులు ఆటాడుకుంటారు..ముప్పుతిప్పలు పెడతారు. ఇదే విషయం ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విషయంలో జరిగింది.

ఎన్నికల వేళ ఓట్లు పడాలంటే ప్రత్యర్థి పార్టీలను ఏమాత్రం కనికరం లేకుండా విమర్శించాల్సిందే. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి. కానీ, అందుకు భిన్నంగా కమలం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కామెంట్లు చేయడం కాషాయపార్టీ కొంప ముంచిందన్న వాదన విన్పిస్తోంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో నయం అంటూ ఆయన వ్యాఖ్యానించడమే దీనంతటికీ కారణం అని తెలుస్తోంది. ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ ఆరోపిస్తోంది. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకూ బీఆర్ఎస్ మద్దతివ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ఎక్కడిదాకో ఎందుకు తాజాగా రైతు బంధుకు మొన్న ఈసీ అనుమతి ఇవ్వడంపై కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే తీరుగా స్పందించింది. బీజేపీ సాయంతోనే అనుమతి తెచ్చుకున్నారంటూ ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా .. వారి కామెంట్లకు బలం చేకూర్చేలా ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి కె.రఘువీర్‌ రెడ్డి.

ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో లాభం చేకూర్చేవిగా ఉండగా.. బీజేపీ పాలిట పెద్ద డ్యామేజీగానే తయారవుతున్నాయన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీని గెలిపించాలంటూ కమలం పార్టీ తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్‌, యోగి.. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు అగ్రనేతలు, కేంద్రమంత్రులు ప్రచారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తమకు పరిస్థితి అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. కేడర్‌ కూడా ఉత్సాహంతో ఉరకలెత్తింది. ఇలాంటి వేళ.. ఇంకా చెప్పాలంటే పోలింగ్‌కు మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా కాంగ్రెస్‌ వేసే ప్రశ్నలకు ఇప్పుడు ఎలా సమధానం చెప్పాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే.. 15 నుంచి 19 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఆదిలాబాద్‌లో నాలుగు, వరంగల్‌, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌లో ఒక్కోస్థానం, కరీంనగర్‌లో రెండు స్థానాల్లో హోరాహోరీ తప్పదన్న అంచనాలున్నాయి. ఇక, గ్రేటర్ పరిధిలోనైతే శేరిలింగంపల్లి, మహేశ్వరం, ఎల్బీ నగర్‌, ఖైరతాబాద్‌ సహా 8 నియోజకవర్గాల్లో టగ్‌ ఆఫ్ వార్ నెలకొంది. ఇలాంటి వేళ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదన్న అభిప్రాయం బీజేపీ నేతలు, శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్