కొత్త ప్రభుత్వంలో సీఎం రిలిఫ్ ఫండ్ సేవలు నిలిచిపోయాయి. 80 రోజుల పాలనలో 80 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. కొత్త దరఖాస్తులపై ఆంక్షలు ఉండ డంతో… జనం నానా అవస్థలు పడుతున్నారు. వైద్యం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతు న్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత ప్రభుత్వంలో 33 వేల సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు పెండింగ్లో ఉండగా… రేవంత్ సర్కార్ లో మరో 50 వేల సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు వచ్చాయి. 350 కోట్లు విడుదల చేస్తే 80 వేల కుటుంబాలకు సహాయం అందుతుంది. కానీ నిధుల విడుదలలో ప్రభు త్వం జాప్యం చేస్తోందని… వెంటనే సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని పేదలు కోరుతున్నారు.