22.2 C
Hyderabad
Tuesday, September 30, 2025
spot_img

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయం- ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, గరిడేపల్లి పాలకవీడు మండలాల్లో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి విజయంతో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఉత్తమ్ పేర్కొన్నారు.

మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు కాంగ్రెస్’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దెదింపి కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీకి చెందిన 35 కుటుంబాలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్