20.7 C
Hyderabad
Wednesday, January 14, 2026
spot_img

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం, వైఎస్సార్ షాదీ తోఫా పథకం నిధులను శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఖాతాల్లో నిధులు జమ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి మార్చి వరకు వివాహం చేసుకున్న 12,132 మంది కొత్త జంటల తల్లుల బ్యాంకు అకౌంట్ లో రూ.87.32 కోట్లు జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ఈ పథకం కింద గత ఆరు నెలల్లో 16 వేల మందికి పైగా లబ్ధిదారులకు మేలు చేశామని అన్నారు. వీరందరి ఖాతాల్లో మొత్తంగా రూ.125.50 కోట్లు జమ చేశామని అన్నారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే.. వధువు ఖచ్చితంగా పదో తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి కాబట్టే ఈ రూల్ ని పెట్టామన్నారు. ఇప్పటికే పేద విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందేజేస్తున్నామని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్