28.8 C
Hyderabad
Monday, June 2, 2025
spot_img

రేపు శ్రీ సత్య సాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు శ్రీ సత్య సాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ప్రజవేదికలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. బహిరంగ సభ అనంతరం గుండుమల గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఏ ప్రాంతంలో పర్యటన ఉంటే ఆ ప్రాంత వాసులతోనే మమేకం అయ్యే విధంగా నూతన విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. లారీల్లో, బస్సుల్లో, ప్రజలను తరలించే విధానానికి స్వస్తి చెప్పామని ఆయన తెలిపారు. చంద్రబాబు పర్యటనలో సామాన్య ప్రజలతో మమేకం అయ్యే విధంగా ప్రజవేదికను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్