విదేశీ పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇండియాకు తిరిగొ చ్చారు. ఏపీలో ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఈ రోజు ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో టీడీపీ నేతలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఇవాళ హైరాబాద్ కు వచ్చారు. రేపు ఆయన అమరావతికి వెళ్లే అవకాశముంది.


