స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. తాజాగా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అంగళ్ళు కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే లక్ష రూపాయల పూచికత్తుతో చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇస్తున్నట్టు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే 70 మందికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఫైబర్ నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పిటి వారంటును విజయవాడ ఏసిబి కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్
0
258
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


