లోక్ సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పార్టీలకు జాతీయ హోదా గుర్తింపు తొలగించింది. NCP, TMC, CPI పార్టీలకు జాతీయ హోదాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా షాక్ ఇచ్చింది ఈసీ. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును రద్దు చేసింది. ఇకపై కేవలం తెలంగాణ రాష్ట్ర పార్టీగా మాత్రమే బీఆర్ఎస్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.