ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, లిక్కర్ స్కాంకు సంబంధించి తీహార్లో జైలు లోనే కవితను సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం, నేడు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు కవితను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రకటిం చింది. దీంతో కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ తరలించనున్నారు. శుక్రవారం కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. ఇక లిక్కర్ స్కాం కేసులో కవితను విచారిం చేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచల నంగా మారింది. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఈడీ కస్టడీలో ఉన్నారు.


