Free Porn
xbporn
22.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

సర్వే ఆధారంగా కంటోన్మెంట్ టికెట్ ఇస్తామన్న బీఆర్ఎస్..

    బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై గులాబీ అధిష్టానం దృష్టి సారించిందా.? ఈ సీటుకు ఉద్యమ కారుల డిమాండ్ పెరుగుతోందా.? తమకు అవకాశం ఇవ్వాలని సాయన్న కుటుంబం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందా.? సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్ ఇస్తామని అధిష్టానం చెప్తోందా.? ఇంతకు కంటోన్మెంట్ రేసులో ఉన్నది ఎవరు.? టిక్కెట్ ఎవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి.?

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ గా మారినట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న లాస్య నందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. మరోసారి తమ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలని నివేదిత బిఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. మరోవైపు కంటోన్మెంట్ నుండి ఉద్యమ కారులు సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని ఆశావహులకు పార్టీ అధిష్ఠానం తెలియజేస్తున్నట్టు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత విజయం సాధించారు. ఆమె మరణించడంతో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరుగబోతుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 18న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. మే 13 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే విధంగా గులాబీ పార్టీ కసరత్తులు చేస్తోంది. కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ అధిష్ఠానం చర్చోపచర్చలు కొనసాగిస్తోంది.

   ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాయన్న మృతితో కుమార్తె లాస్య నందితకు పార్టీ అవకాశం కల్పించింది. ఆమె సైతం కారుప్రమాదంలో గత నెలలో మృతి చెందింది. దీంతో ఆమె సోదరి నివేదిత పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ పరిస్థితిలో.. కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపై బిఆర్ఎస్ అధిష్ఠానం సమాలోచనలు జరుపుతోంది. మరోసారి సాయన్న కుటుంబానికి అవకాశం ఇస్తే సెంటిమెంట్ కలసి వస్తుందా లేదా అనే దానిపై లెక్కలు వేస్తోంది. ఇదిలా ఉండగా, కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ కోసం పలువురు ఉద్యమకారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తమకు టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. సాయన్న కుటుంబంపై ప్రజల్లో ఉన్న ఆదరణతో ఉద్యమకారులకు అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఉద్యమకారులు తెరమీదకు వచ్చారు.

    రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన గజ్జెల నగేష్, తెలంగాణ రాష్ట్ర మైనింగ్ సంస్థ చైర్మన్‌గా పనిచేసిన క్రిశాంక్ తో పాటు మరో ఇద్దరి పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్రిశాంక్ కు టిక్కెట్ ఇవ్వడం లేదని తెలియ జేశారు. భవిష్యత్ లో ప్రాధాన్యం ఇస్తామని నాడు కేటీఆర్ చెప్పారు. దీంతో, ఇప్పుడు క్రిశాంక్ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అధిష్టానం నియమించింది. కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై స్థానిక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు.కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై బిఆర్ఎస్ అధిష్టానం సర్వేలునిర్వహిస్తోంది. పార్టీపైనా, పలువురు నేతలపైనా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆశావహులకు గులాబీ అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

    అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయింది. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ అలెర్ట్ అయింది. నిబద్ధతతో ఉండేవారికి, గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు. ఇందులో భాగంగానే అభ్యర్ధి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం.కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి కాంగ్రెస్, బీజేపీలు అంగీకరిస్తాయా..? అలాకాని పక్షంలో ఉప ఎన్నిక అనివార్యమైతే బిఆర్ఎస్ సాయన్న కుటుంబానికి టిక్కెట్ ఇస్తుందా..? ఇవ్వదా..? బీఆర్ఎస్ అధిష్ఠానం మదిలో ఏముంది….? భవితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్