స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో మరో చిరుత చిక్కింది. నాలుగు రోజుల క్రితం కెమెరా కంట్లో పడ్డ ఈ చిరుతను తాజాగా బంధించారు. అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్త మండపం వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఇది చిక్కింది. దీంతో, ఈ రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలు అటవీశాఖ అధికారులకు చిక్కినట్టయింది.
ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తిరుమల కొండల్లో పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు.