33.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

వేతన జీవులకు ఊరట… రూ.12 లక్షల వరకు నో ఇన్‌కం ట్యాక్స్‌

వ్యక్తిగత ఆదాయపన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నాగా ఉంటుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

పన్ను సంస్కరణల్లో కీలక ముందడుగు పడింది. వచ్చే వారం కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తామన్నారు.

కొత్త పన్ను శ్లాబుల సవరణ

4 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి మినహాయింపు, రూ.4 నుంచి 8 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.8 నుంచి 12 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.20 నుంచి 24 లక్షల వరకు 25 శాతం పన్ను ఉంటుంది. ఆదాయం రూ.24 లక్షల పైబడితే 30 శాతం పన్ను ఉంటుంది.

Latest Articles

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయి కేటాయింపులు

తెలుగు రాష్ట్రాల రైల్వే బడ్జెట్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తెలంగాణకు రూ. 5,337 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు రికార్డు స్థాయిలో రూ.9,417 కోట్లను కేటాయించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్