మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా ‘భ్రమయుగం’ అనే పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ నైట్ షిఫ్ట్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళ వెర్షన్ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ “ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్” రిలీజ్ చేస్తుండగా, కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ ఆంటో జోసెఫ్కి సంబంధించిన “AAN మెగా మీడియా” రిలీజ్ చేయనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి ఈ సినిమా మార్కెటింగ్ ప్రమోషన్స్ను నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ప్రారంభించింది.
ఇక ‘భ్రమ యుగం’ అనేది మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ స్వీయ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్పై ప్రతిష్టాత్మక నిర్మితమవుతున్న మలయాళ చిత్రం. ఈ బ్యానర్ ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ అని చెబుతున్నారు. ఈ క్రమంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ – వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘భ్రమయుగం’ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్గా జోతిష్ శంకర్, ఎడిటర్గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు.