30.8 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

బీఆర్ఎస్ వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోలేదు: బొత్స

విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanaryana)స్పష్టంచేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనేది మా నినాదమన్నారు. ప్రైవేటీకరణ ఆపాలని తాము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్(BRS)పార్టీ వల్లే ప్రైవేటీకరణ తాత్కాలికంగా ఆగిపోయిందనే ప్రచారంపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, జనసేన(Janasena)పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

అలాగే కోడికత్తి(Kodikathi)కేసుకు సంబంధించిన NIA రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. 2003లో అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేయడం వెనక కూడా రాజకీయ లబ్ధి ఉందా? అని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాస్ వెనక ఎవరున్నారో తేలాలని.. ఈ కేసులో సమగ్ర విచారణ జరగాలన్నదే వైసీపీ డిమాండ్ అన్నారు బొత్స.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్