22.5 C
Hyderabad
Wednesday, August 27, 2025
spot_img

చంద్రబాబుకు లేఖ రాసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ లేఖ రాశారు. తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమలకు అవినీతి మకిలీ అంటుకుందని అన్నారు. భక్తుల సౌకర్యాలు మృగ్యమయ్యాయి, అన్యమతాల ఉనికితో సనాతన ధర్మానికి విఘాతం వాటిల్లిందని చెప్పారు. గత కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవినీతి అరోపణలు వచ్చాయన్నారు.

అర్హతలను బట్టి కాకుండా సొంత మనుషులతో TTDని నింపారని ఆరోపించారు. TTDని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలని కోరారు. శ్రీవాణి ట్రస్టుకు పది వేల విరాళం ఇస్తే సామాన్య భక్తులకు కూడా వీఐపీ దర్శనం కల్పించేవారని,భక్తుల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు. శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని లేఖలో లక్ష్మణ్ కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్