బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున చిత్రం “పరాక్రమం”. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్, అక్టోబర్లో రెండు షెడ్యూల్స్లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం ప్రీ టీజర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ ‘‘నేను నటుడిగా, దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. “కళ నాది. వెల మీద” అనే కాన్సెప్ట్తో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసిన “నిర్బంధం, మాంగల్యం” లాంటి కల్ట్ సినిమాలో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను “బీఎస్కే మెయిన్ స్ట్రీమ్” అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నాను. కుటుంబం మొత్తం చూసేలా “పరాక్రమం” అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. “I, ME, MYSELF” దీని టాగ్ లైన్. ఈ చిత్ర కథాంశం గురించి చెప్పాలంటే – గోదావరి జిల్లాలో “లంపకలోవ” గ్రామంలో పుట్టిన “లోవరాజు” అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం , రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నాను. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీ, నటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను.’’ అని చెప్పారు.