కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గీత కార్మికు లను ఆదుకోవా లనే సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు గ్రామంలో ఇటీవల కాలిపోయిన తాటి వనాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక గీత కార్మికులు, స్థానికులతో మాట్లాడారు. నష్టపోయిన గౌడన్నలను పరామర్శిం చారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాల పై 90 శాతం సబ్సిడీ ఇస్తాన్న హామీ ఏమైందని బండి ప్రశ్నించారు.


