స్వతంత్ర వెబ్ డెస్క్: నేడు వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ వివేకా కూతురు సునీత.. అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పీటీషన్ దాఖలు చేసారు. ఈ విచారణ నేడు జరగనుంది.
ఈ నెల 13న జరిగిన విచారణలో సీనియర్ల లాయర్ల వాదనలను వినబోమని కోర్టు చెప్పడం వల్ల తన కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియర్ లాయర్ల వాదనలు విననందున సీబీఐకి నోటీసులు జారీచేసే విషయాన్ని ధర్మాసనం పట్టించుకోలేదు. అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. జస్జిస్ విక్రమ్నాథ్, జస్జిస్ అసనుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను నేటికీ వాయిదా వేసింది.