Crime | భాగ్యనగరంలో రోజురోజుకి హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా మహేశ్వరం పరిధిలోని సర్దార్ గేట్ సమీపంలో గోనెసంచిలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్రంగా బాధించిన దుండగులు.. మహిళను చంపి గోనెసంచిలో పెట్టి.. రోడ్డు పక్కన వదిలివెళ్లారు. అక్కడే ఉంటున్న స్థానికులకు అనుమానం వచ్చి గోనెసంచి తెలిచి చూసే సరికి ఒకసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆసీఫ్ అంజయ్య ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని ఎవరు ఇక్కడ పడేశారు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.