స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీరాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయని తెలియజేశారు. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానని తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేసేందుకు సంకల్పించినా కూడా.. ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామన్నారు. ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసిన అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేశామని తెలిపారు.