డేటింగ్ యాప్లోకి దూరిన ఢిల్లీ ముఠా.. వీరి స్కెచ్కు కాసులే కాసులే పోలీసులు ఎంట్రీతో.! డేటింగ్ యాప్ వాడుతు న్నారా.?ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకుండానే చాట్ చేస్తున్నారా? డిన్నర్కు బయటికి వెళ్దామని అడుగుతు న్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త సిటీలోకి వచ్చిన కొత్త గ్యాంగ్ ఒకటి మిమ్మల్ని నట్టేట ముంచడానికి సిద్ధమవుతుంది. మీకు తెలియకుండానే మిమ్మల్ని ముగ్గులోకి దింపి నీటుగా మీ పర్సు ఖాళీ చేయాలని ఒక భారీ స్కెచ్ గీశారు. పొరపాటున మీరు ఈ ట్రాప్ లో పడ్డారా ఇక మీ కథ కంచికే..!
హైదరాబాద్ పబ్లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. పబ్లో క్యాష్ రష్ కోసం పబ్ యజమానులు భారీ మోసా నికి పాల్పడ్డారు. లక్షలు దోచుకుంటున్న ఢిల్లీ గ్యాంగ్ వారితో చేతులు కలిపిన మోష్ పబ్బు నిర్వాహకుల బాగోతాన్ని చేధించారు మాదాపూర్ పోలీసులు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు సభ్యుల ముఠా హైదరాబాద్లో మాకాం వేసి డేటింగ్ యాప్ల ద్వారా కొంతమంది యువకులను టార్గెట్ చేసింది. అబ్బాయిలను ట్రాప్ చేసి పబ్కి తీసుకెళ్లి అధిక ధరలకు ఆహారం పానీయాలను ఆర్డర్ చేయమని ఒత్తిడి చేయించి బిల్ కట్టే సమయానికి అమ్మాయి అదృశ్యం తో బాధితుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాడు. నిరుద్యోగ యువతను ట్రాప్ చేసి డేటింగ్ యాప్లో వారి ఫోటోలను అప్లోడ్ చేసి యువకులకు గాలం వేస్తున్నారు. డేటింగ్ యాప్లలో అబ్బాయిలను ట్రాప్ చేసి పబ్కి తీసుకెళ్లి చీట్ చేస్తున్నారు ఈ ముఠాలోని అమ్మాయిలు. పబ్లలో సెపరేట్ QR కోడ్ మెషిన్ డెవిల్స్ నైట్ పేరుతో ఒక ప్రత్యేక మైన మెనూ వీరికి అందజేస్తారు. అమ్మాయిలకి తక్కువ ఆల్కహాల్ వారు తీసుకొచ్చినటువంటి అబ్బాయిలకి ఎక్కువ ఆల్కహాల్ సరఫరా చేసి మత్తులోకి దింపుతున్నారు. యువకులతో వచ్చిన అమ్మాయిలు బిల్ కట్టే సమయానికి జారుకుంటున్నారు
కస్టమర్లకు ఎక్కువ బిల్ వేసి వసూలు చేస్తున్నారు పబ్ యజమానులు. మొత్తం వచ్చినటువంటి వసూల్ నగదును అమ్మాయి, పబ్ నిర్వాహకులు ఈ గ్యాంగ్ సమంగా షేర్ చేసుకుంటున్నట్లు తేలింది. 40 రోజుల్లో 40 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. సిటీలోని మోష్ పబ్ ఓనర్స్ తరుణ్, జగదీష్, మేనేజర్ సాయికుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఈ తరహా మోసాలకు పాల్పడు తున్న పబ్లపై ఫోకస్ పెట్టామన్నారు డీసీపీ. డేటింగ్ యాప్తో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురుతో పాటు ఇందులో సంబంధం ఉన్న మిగిలిన వారిని కూడా అరెస్టు చేయబోతున్నట్టు డీసీపీ చెప్పారు.
జాబ్ కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలను నియమించుకుని డేటింగ్ యాప్లలో నకిలీ ప్రొఫైల్లను సృష్టించే కస్టమర్లను ఆకర్షించడానికి ఆన్లైన్ డేటింగ్ యాప్లలో వారి ప్రొఫైల్లను ఉపయోగించారు. నిందితుల్లో ఒకరైన సూరజ్ కుమార్ మహిళగా నటిస్తూ పురుషులతో చాటింగ్ చేసే వాడు. ఆ తర్వాత మహిళలను ముందుగా కేఫ్లో కలవడానికి అనుమతించండి, ఆపై బాధితులను పబ్కి వెళ్లేలా మార్చండి అనే సూచనలు ఇస్తారు. వలలో పడ్డ యువకుల్ని మోష్ పబ్కు ఆహ్వానించి, ఖరీదైన మద్యం కొనుగోలు చేసేలా బలవంతం చేసినట్లు విచారణలో తేలింది. మోసపోయిన మొత్తం 50 నుంచి 60 మంది బాధితుల 30 లక్షలు నగదును స్కామర్లకు, పబ్ యజమానులకు మధ్య జరిగిన కార్యకలాపా లను వివరిస్తూ, నిందితులు ఢిల్లీలో డెవిల్స్ నైట్ క్లబ్ పేరుతో నైట్క్లబ్ నిర్వహిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్లోని బాధితులను మోష్ పబ్కు ఆహ్వానించి, అక్కడ వారు అధిక ధరలకు ఆహారం, పానీయాలను ఆర్డర్ చేయమని ఒత్తిడి చేశారు. ముఠా సభ్యులు స్కా ప్రయోజనాల కోసం మాత్రమే అధిక ధరలతో ప్రత్యేక మెనుని ఏర్పాటు చేశారు. ఈ కుంభకోణం గతంలో ఢిల్లీ, బెంగళూరు వెలుగులోనికి వచ్చింది. గూగుల్ రేటింగ్స్తో కష్టపడుతున్న పబ్లను నిందితులు టార్గెట్ చేస్తున్నారని డీసీపీ తెలి పారు. నిందితుడి నుంచి 40 లక్షల నగదు, 8స్మార్ట్ ఫోన్లు, కోట్ల విలువైన కార్లను స్వాధీనం చేసుకుని ఐపీసీ సెక్షన్ 406, 419, 420 క్రింద కేసు నమోదు చేశారు.డేటింగ్ యాప్ మోసాల కు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే 100కు డయల్ చేసి, సైబరాబాద్ డ్రగ్ అబ్యూజ్ ద్వారా పోలీసులకు తెలియజే యాలన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తిని గోప్యంగా ఉంచుతామన్నారు పోలీసులు.


