34.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

గుడిలో టీడీపీ నేతకు పూజ చేశాడని.. పూజారి సస్పెండ్!

Palnadu |పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలో సామాన్యులు ఇబ్బందులకు గురువుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ వారికి.. ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే ఈ పార్టీ వారికి కోపం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలోనే నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి(Julakanti Brahmananda reddy)చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొన్ని నెలల క్రితం నిదానంపాడు అమ్మవారి గుడికి వెళ్లగా.. గుడి పూజారి తన కోసం పూజలు చేస్తే.. ఆ పూజారిని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ప్రత్యర్థులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గుడికి వెళ్లిన ప్రతి ఒక్కిరికి పూజారి ఆశీర్వాదం ఇవ్వాల్సిందే కదా.. చివరికి పూజారిని కూడా హింసించే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని జూలకంటి వెల్లడించారు.

Read Also: లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు

Follow us on:  Youtube   Instagram

Latest Articles

ఈశాన్య భారతంలో కాంగ్రెస్ పట్టు సాధించేనా ?

  ఈశాన్య భారతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే గత పదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి.ఈ పదేళ్లకాలంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది .భారతీయ జనతా పార్టీ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్