30.7 C
Hyderabad
Friday, June 9, 2023

మహానాడులో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన?

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మే 27,28 తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్టీఆర్ శతజయంతితో పాటు ఎన్నికల ఏడాది కావడంతో మహానాడును ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగనుంది. గోదావరి ప్రజల మన్ననలు పొందితే రాష్ట్రంలో అధికారం ఖాయమనే సెంటిమెంటుతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందుకే మహానాడులో ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను విడుదల చేసే అవకాశమున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో భాగంగా మహానాడు వేదికగా అధినేత చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పనున్నారని తెలిపారు. దీంతో మేనిఫెస్టో ముసాయిదా ప్రకటించనున్నారనే వాదన బయటకు వచ్చింది. అయితే ఈ మేనిఫెస్టో ప్రజల అకాంక్షలకు తగ్గటు ఉంటుందా? బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూర్చనుందా? యువతకు భరోసా ఇవ్వనుందా? అనే అంశాలపై అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్