ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద పుష్ప త్రీ సినిమాను చూపించాడు ఓ పెద్దాయన. స్కూటీలో మద్యం బాటిల్స్ను నింపుకుని తెలంగాణ నుంచి పయనమై, కాలం కలసిరాక నందిగామ ఖాకీలకు చిక్కాడు. స్కూటీలో గుట్టు చప్పుడు మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టిన ట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. వంద క్వార్టర్ బాటిల్స్ను స్వాధీనం చేసుకుని వృద్దుడిపై కేసు నమోదు చేశారు.


