23.7 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

సీఎం జగన్‌ కు అమిత్‌ షా వార్నింగ్‌..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారిని మందలించి పంపించినట్లు తెలిసిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బీజేపీ నాయకత్వం చెబితేనే అరెస్టు చేశామని చిత్తూరు జిల్లాలో మంత్రి గారి సమక్షంలో ఒక ఎంపీ అన్నారని తెలిపారు.

ఒక మంత్రి సమక్షంలో ఎంపీ అన్నారంటే అది ఎందుకు అబద్ధం అయి ఉండకూడదు అన్న ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదని, చేసిందంతా మీరు చేసి… మమ్మల్ని అందులోకి లాగుతారా? అంటూ అమిత్ షా గారు జగన్ మోహన్ రెడ్డి గారికి అక్షితలు వేసినట్లు తెలిసిందన్నారు. తమ పార్టీకి సంబంధం లేకుండా నిందలు వేయడం మంచి పద్ధతి కాదని అమిత్ షా గారు మందలించి ఉండవచ్చునని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

హోం శాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత పోలవరం నిధులు, రైల్వే జోన్, పెండింగ్ బకాయిల కోసమే కలిసినట్లుగా రొటీన్ డైలాగులు చెప్పారన్నారు. ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగారని, లేదు పొమ్మని ప్రధాని గారు అనడంతో, బయటకు వచ్చి అపాయింట్మెంటే అడగలేదని చెబుతారని, ప్రధాని గారితో పాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే తాను భావించానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్