స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ఇరు రాష్ట్రాలు అల్లాడిపోతున్నారు. నేడు, రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవనున్నటు వాతావరణ అధికారులు తెలిపారు. అధిక ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఇవాళ 45, రేపు 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో నిన్న అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.