26 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. దరఖాస్తులకు నేడే లాస్ట్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్. ఉపాధ్యాయ నియామకాల పరీక్ష (టీఆర్‌టీ) దరఖాస్తు రుసుం చెల్లింపునకు ఇవాళ్టితో గడువు ముగుస్తుంది. ఇవాళ రాత్రిలోగా ఫీజు చెల్లించిన వారికి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 1.38 లక్షల మంది ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 1.33 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు. నవంబరు 20వ తేదీ నుంచి టీఆర్టీ పరీక్షలు జరగాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరోజే ఉండటం వల్ల ఈ పరీక్షను వాయిదా వేశారు. తిరిగి ఈ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేశారు. మొదట్లో దరఖాస్తుల సమర్పణకు సాంకేతిక సమస్యలు వచ్చినందున రుసుం చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరీక్ష ఆన్​లైన్​లో జరగనున్న విషయం తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్