స్వతంత్ర, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా చివ్వేంల పోలీస్ స్టేషన్ లో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. ఎస్సైగా కాన్సర్ బాధితురాలు ధారవత్ స్వాతి విధుల్లోకి చేరారు. దీంతో స్వాతి చివరి కోరిక నెరవేరింది. ప్రాంక్రియాటిస్ కాన్సర్ తో బాధపడుతున్న స్వాతి చివరి కోరికను పోలీస్ శాఖ నెరవేర్చింది. నాలుగు రోజులకిందట మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి తన చివరి కోరిక వెల్లడించడంతో స్వాతి ఆశయాన్ని నెరవేర్చాలని పోలీసులకు ఆదేశించడంతో పోలీసులు.. స్వాతి కోరికను నెరవేర్చారు.