రేపు రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్… 1500 మంది పోలీసులతో భారీ భద్రత

IPL Cricket | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఏపీఎల్ పండుగ మొదలైయింది. ఇప్పటికే హైద‌రాబాద్ లో ఐపీఎల్ ఫీవ‌ర్ షురూ అయింది. రేపు మ‌ధ్యాహ్నం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు… స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్రమంలో నగర పోలీసులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. రేప‌టి మ్యాచ్ ఏర్పాట్లు గురించి రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ భద్రతా ఏర్పాట్ల గురించి మీడియాకు వెల్లడించారు. నగరంలో భద్రత కల్పించేందుకు 1500 మంది పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా… అలాగే నగర వాససులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. క్రికెట్ మ్యాచ్(IPL Cricket) ముగిసిన తర్వాత నగరపౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. అలాగే ఆన్ లైన్ లో టికెట్స్ విక్రయాలు జ‌రిగాయ‌ని తెలిపారు. ఎవరైనా బ్లాక్ లో టిక్కెట్లు విక్ర‌యిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తెలిపారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నగరంలో ఎలాంటి అఘాయిత్యాలు జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

Read Also:  మొదలైన ఐపిఎల్‌ మ్యాచ్‌లు.. ఎక్కువ ఆశపడ్డారా.. ఇక అంతే..

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్