కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలు – ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఓసీలు, ఎస్సీల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు. కరీంనగర్‌లో మహాత్మ జ్యోతిబా పూలె విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు 56.3శాతం రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ.. బీసీ గణన సరిగా జరగలేదనే మాట ప్రతి చోట వినిపించిందని.. కేసీఆర్‌ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారన్నారు. బీసీల జనాభా కేవలం 46.2శాతం మాత్రమే ఉన్నదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకొని 56.3 శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్‌లు పెట్టీ మీ చిత్త శుద్ధి నిరూపించుకొండి అని ఆమె వ్యాఖ్యానించారు.

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్