బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ వంగాగీత హెచ్చరించారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని కొందరు ధ్వంసం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి వంగా గీత పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి, రోడ్డు ఇరువైపులా మానవహారం నిర్వహించారు. టీడీపీ అధికాంలోకి వచ్చినప్పటి నుంచీ విధ్వంసాలు పెరిగిపోతున్నాయని గీత ఆరోపించారు. అంబేద్కర్ స్మృతివనంలో జరిగిన దాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు వస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై కక్షతోనే స్మృతివనంలో విధ్వంసం చేశారని గీత విమర్శించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సహించేది లేదు- పిఠాపురం వైసీపీ ఇన్చార్జి గీత
0
205
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


