కేజీబీవీ హాస్టల్లో సమస్యలు ఉన్నాయని మంత్రికి విద్యార్థినిలు లేఖ రాశారు. దీంతో హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీచేసి, లోటుపాట్లపై ఇంచార్జ్ ఎస్ఓపై మంత్రి సవిత మండిపడ్డారు. హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఈ సంఘటన జరిగింది. హాస్టల్ విద్యార్థినులతో మంత్రి సవిత ముచ్చటించి, సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ ఇంచార్జ్ ఎస్ఓ శాలినిదేవిపై విద్యార్థినులు పలు ఆరోపణలు చేశారు. హాస్టల్ వంటగదిని పరిశీలించి, కుళ్లిన కాయగూరల్ని చూసి వార్డెన్పై మంత్రి మండిపడ్డారు. సరిగా లేని బాత్రూంలను చూసి ఫైరయ్యారు.


